గొర్రెలను కాసి వార్తల్లో నిలిచిన మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థుల ఫై తనదైన శైలిలో విమర్శలు , సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలిచే మల్లారెడ్డి..తాజాగా గుర్రెలను కాసి వార్తల్లో నిలిచారు. గురువారం మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి మల్లారెడ్డి గొంగడి కప్పుకుని, గొర్రెలను కాసి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్… అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు ఇస్తున్నామని, ఒక్కో యూనిట్‌లో 21 గొర్రెలు ఉంటాయని అన్నారు. తెలంగాణ మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.