చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్ః ఈరోజు హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. రూ.45.29 కోట్ల వ్యయంతో 674 మీటర్ల పొడవు నిర్మించిన ఈ పైవంతెనతో శంషాబాద్ ఎయిర్పోర్టు, వరంగల్, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు సుమారు 10 నిమిషాల సమయం ఆదా కానున్నది. స్థానిక ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. కాగా, ఫ్లై ఓవర్ గత మంగళవారమే ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/