కరోనా కేసుల్లో ఢిల్లీని వెనక్కి నెట్టిన ఏపి

ఏపి మొత్తం కేసులు 1,40,933…ఢిల్లీలో మొత్తం కేసులు1,35,598

Coronavirus cases

న్యూఢిల్లీ: ఏపిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. నిన్న తాజాగా 10 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం 1,40,933కు చేరాయి. దీంతో గ‌త కొన్ని వారాలుగా మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు త‌ర్వాత మూడో స్థానంలో కొన‌సాగుతున్న ఢిల్లీని ఏపి దాటేసింది. ఢిల్లీలో నిన్న 1,195 క‌రోనా కేసులు న‌మోద‌వ‌డంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,35,598కి చేరింది. ఏపిలో కేవలం మూడు రోజుల్లోనే 30,636 పైగాపాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం కేసులు 1.4 ల‌క్ష‌లు దాటాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ పాజిటివిటీ రేటు 7.22 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 1349 మంది మ‌ర‌ణించారు. ఏపిలో నిన్న‌టివ‌ర‌కు మొత్తం 19,51,776 మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అత్య‌ధిక కేసుల‌తో మ‌హారాష్ట అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. శుక్ర‌వారం వ‌ర‌కు రాష్ట్రంలో 4,11,798 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. 2,39,978 క‌రోనా కేసుల‌తో త‌మిళ‌నాడు రెండో స్థానంలో ఉన్న‌ది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/