నేడు ఖమ్మంలో పర్యటించనున్న కెటిఆర్
ఇల్లందు: ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మున్సిపాలిటీలో ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఈ రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ… ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇల్లెందు మున్సిపాల్ కార్యాలయంలో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బహిరంగ సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/