ఈరోజు వికారాబాద్, చేవెళ్లలో మంత్రి కెటిఆర్ రోడ్ షో
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, బిఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో మంత్రి కెటిఆర్ గురువారం పర్యటించనున్నారు. వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు.
ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్కు చేరుకుంటారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై రోడ్ షో నిర్వహించి ప్రసంగిస్తారు. అనంతరం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పిల్లికి చేరుకుంటారు. బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి రోడ్షో నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తిచేశారు. కాగా, గురువారం సాయంత్రం హైదరాబాద్లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో మంత్రి కెటిఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు.