అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌లకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన

minister-ktr

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోసిటీలో అమరరాజా ఈ-పాజిటివ్‌ ఎనర్జీ ల్యాబ్స్‌కు శంకుస్థాపన చేశారు. గిగా కారిడార్‌లో భాగంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ ల్యాబ్‌కు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక కంపెనీలకు తెలంగాణ ఫేవరెట్‌ అని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అమర రాజా సీఎండీ జయదేవ్ గల్లా, ఆస్ట్రేలియన్ కాన్సుల్‌ జనరల్ హిల్లరీ మెక్‌గేచీ, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.