శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న మంత్రి హ‌రీశ్‌రావు

Minister Harish Rao introducing the budget in the Legislative Assembly

హైదరాబాద్‌ః ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్‌ను హ‌రీశ్‌రావు చ‌దివి వినిపిస్తున్నారు. స‌భ‌లో సీఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది. గత మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

కాగా, అంతకముందు మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా.. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకు వెళ్తున్నదని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కెసిఆర్‌ ఆలోచనతో బడ్జెట్‌ కేటాయింపులు చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలోనూ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. బడ్జెట్‌కు కేబినెట్‌తోపాటు గవర్నర్‌ ఆమోదం కూడా లభించిందని వెల్లడించారు. మండలిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు.