అసెంబ్లీకి హాజరైనా మంత్రి హరీష్రావు
కరోనా నుండి కోలుకున్న మంత్రి హరీష్రావు
హైదరాబాద్: రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మిగతా ఎమ్మెల్యేందరూ కూడా కొవిడ్19 టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్ వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. టెస్టులు చేయించుకోని ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడు కొవిడ్ నిబంధనలు చేపట్టాలని సభ్యులను స్పీకర్ కోరారు. కాగా మంత్రి హరీష్రావు కరోనా నుండి కోలుకున్న విషయం తెలిసిందే.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/