సీఎం కేసీఆర్‌‌పై సంచలన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే

తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజెపి మరింత దూకుడు పెంచింది. మంగళవారం హైదరాబాద్ లో మోడీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించగా..వరుస పెట్టి బిజెపి ఎంతలు బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే సీఎం కేసీఆర్‌‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పర్యటనలో ఉన్న చౌబే.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

కేసీఆర్ సర్కార్ లిక్కర్ స్కామ్, అవినీత మీద పడిందని అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తన 9 ఏళ్ల పాలనలో తెలంగాణను నరకప్రాయంగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని, రేపో మాపో ఆమెకు శిక్ష పడడం ఖాయమని, జైలుకు వెళ్లక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలుకు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరని, ఆమెను ఎవరూ కాపాడలేరని అన్నారు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయే రోజులు దగ్గరపడ్డాయని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, దానిని కచ్చింగా నెరవేరుస్తారని తెలిపారు.