రేపు రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్లు

బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్‌ , కామారెడ్డి లలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ లో నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నెల 10 తో నామినేషన్ల స్వీకరణ పూర్తి అవుతుంది. దీంతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లను పూర్తి చేసారు.

ఇక రేపు సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.