సికింద్రాబాద్‌లో ప్రారంభమైన మింగ్స్‌ కోర్ట్‌

నూతన ఔట్‌లెట్‌తో ఎక్సోటిక్‌ చైనీస్‌ రుచులను తీసుకురావడం ద్వారా తమ మింగ్స్‌ కోర్ట్‌ 25వ వార్షికోత్సవాన్ని వేడుక చేస్తోన్న ఓహ్రీస్‌ గ్రూప్‌

Ming’s Court started in Secunderabad

హైదరాబాద్: భారతదేశంలో ప్రతిష్టాత్మక రెస్టారెంట్‌ చైన్‌లలో ఒకటైన ఓహ్రీస్‌ , తమ అద్భుతమైన చైనీస్‌ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ మింగ్స్‌ కోర్ట్‌ 25వ వార్షికోత్సవాన్ని తమ 3వ ఔట్‌లెట్‌ను సికింద్రాబాద్‌లోని బసేరా వద్ద ప్రారంభించడం ద్వారా వేడుక చేసుకుంటుంది. ఈ రెస్టారెంట్‌ అసాధారణ కలినరీ అనుభవాలు మరియు వాతావరణంతో చవులూరించే సెన్సేషనల్‌ రుచులను అందించే నూతన మెనూ అందిస్తుంది. ఈ మింగ్స్‌ కోర్ట్‌ అద్భుతమైన చైనీస్‌ డెకార్‌ కలిగి ఉంటుంది. దీనిలో హ్యాండ్‌ ప్రింటెడ్‌ మ్యురల్స్‌, లాంతర్లు ఉండటం వల్ల చక్కటి చైనీస్‌ సన్నిహిత భోజన అనుభవాలూ పొందవచ్చు.

నగరంలో 25 సంవత్సరాల మహోన్నత రెస్టారెంట్‌ వారసత్వానికి ఘనమైన నివాళిగా సికింద్రాబాద్‌లో మింగ్స్‌ కోర్ట్‌ ప్రారంభం ఉంటుంది మరియు సికింద్రాబాద్‌లోని భోజన ప్రియులను ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. ఈ నూతన ఔట్‌లెట్‌ తనతో పాటుగా అధీకృత చైనీస్‌ క్యుసిన్‌ను ఆధునిక మలుపు జోడించి, ఎలాంటి లోపాలు లేనట్టి సేవలతో అందిస్తుంది. ఈ రెస్టారెంట్‌ , చైనీస్‌ క్యుసిన్‌ కళాత్మకతకు భారతీయ మలుపును అందించి వినూత్నమైన మెనూ అందిస్తుంది. ఈ మెనూను నిపుణులతో కూడిన చెఫ్‌ల బృందం ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. వీరంతా కూడా తమ నైపుణ్యంను గత కొన్నేళ్లుగా మెరుగుపరుచుకుంటూనే, సంప్రదాయ చైనీస్‌ వంటకాల తయారీలో ప్రత్యేక నైపుణ్యం సంతరించుకుని, సమకాలీన పాకశాస్త్ర పద్ధతులను వినియోగిస్తున్నారు. రుచికరమైన డిమ్‌సమ్స్‌ మొదలు సిజ్లింగ్‌ స్టిర్‌ ఫ్రైస్‌, తాజా సీఫుడ్‌, రసాత్మక ఒలికించే మాంసం, శాకాహార అవకాశాలు వంటివి దీనిలో లభిస్తాయి. భోజన ప్రియులకు మరిచిపోలేనట్టి కలినరీ ప్రయాణాన్ని అందిస్తామనే వాగ్ధానాన్ని మింగ్స్‌ కోర్ట్‌ చేస్తుంది. అత్యంత రుచికరమైన ఈ మెనూలో క్లాసిక్‌ చైనీస్‌ వంటకాలైన జియాంగ్‌ చిల్లీ చికెన్‌, కాంజీ క్రిస్పీ లాంబ్‌, కాంటోనీస్‌ ఫ్రైడ్‌ నూడిల్స్‌ తో పాటుగా వినూత్నమైన, ఆధునిక వంటకాలైన స్పైస్డ్‌ సీసామీ చికెన్‌, ప్రాన్‌ స్యుమై ఓరియెంటల్‌ ఫ్రైడ్‌ స్ర్పింగ్‌ రోల్‌ మరియు మరెన్నో ఉన్నాయి. ఈ మెనూతో సమానంగా ఆసక్తికరమైన బేవరేజ్‌ మెనూ సైతం ఈ బృందం తీర్చిదిద్దింది.

ఈ సందర్భంగా ఓహ్రీస్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ అమర్‌ ఓహ్రీ మాట్లాడుతూ‘‘కలినరీ పరిశ్రమలో సుప్రసిద్ధమైనది మింగ్స్‌ కోర్ట్‌. దీని తాజా గమ్యస్ధానం సికింద్రాబాద్‌. మా విజయపరంపర, అసాధారణ ఆహారం, ఆతిధ్యం అందించాలనే మా నిబద్ధతకు ప్రతిరూపంగా ఇది నిలువనుంది. మింగ్స్‌ కోర్ట్‌ యొక్క 25వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ హైదరాబాద్‌లో మా మింగ్స్‌ కోర్ట్‌ మూడవ ఔట్‌లెట్‌ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా అతిథులకు మరిచిపోలేనట్టి కలినరీ ప్రయాణం అందించాలనేది మా లక్ష్యం. ఈ కలినరీ ప్రయాణం అద్భుతమైన రుచులు, టెక్చర్స్‌, ప్రెజెంటేషన్స్‌తో ఆధీకృతం కావడం మాత్రమే కాదు సమకాలీనంగానూ ఉంటుంది’’ అని అన్నారు.