లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73,917కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,466 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.34 వద్ద కొనసాగుతుంది.