హోండా షైన్లో బీఎస్-6 వెర్షన్
న్యూఢిల్లీ: హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) గురువారం తన షైన్ బైక్ మోడల్ బీఎస్-6 వెర్షన్ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 67,857 (ఎక్స్షోరూం-ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. షైన్ గత వెర్షన్తో పోలిస్తే బీఎస్-6 కూడిన కొత్త వెర్షన్ 14 శాతం అదనపు మైలేజీని అందిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 125 సీసీ విభాగంతో షైన్ మరో విప్లవమని, దేశంలో తమ వ్యాపార విస్తరణకు ఇది తోడ్పడుతుందని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈవో, ఎండీ వినోద్ మినోరు కటో అభిప్రాయపడ్డారు. బీఎస్-6 ప్రమాణాలు కలిగిన 2.5 లక్షల ద్విచక్ర వాహనాలను ఇప్పటికే విక్రయించామని తెలిపారు. ఇప్పటి వరకు 80 లక్షల షైన్ బైక్లను విక్రయించామని హెచ్ఎంఎస్ఐ సీనియర్ నేత వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/