లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే ఊపును కొనసాగించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు లాభపడి 65,931కి చేరుకుంది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 19,783కి పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.35 వద్ద కొనసాగుతుంది.