లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 60,431కి చేరుకుంది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డారుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.79 వద్ద కొనసాగుతుంది.