నవంబర్లో బ్యాంకులకు 8రోజుల శెలవులు
ఆన్లైన్, ఇంటర్నెట్ సదుపాయాలు యధాతథం
న్యూఢిల్లీ: వచ్చేనెలలో బ్యాంకులకు ఎనిమిదిరోజులపాటు శెలవులు వస్తున్నాయి. ప్రభుత్వ సెలవులతోపాటు పండుగల సందర్భంగా బ్యాంకులకు ఎనిమిదిరోజులపాటు సెలవులు ప్రకటించారు.
నవంబరు నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు వచ్చాయి. దీనితోపాటు దీపావళి, గురునానక్జయంతి శెలవులు కూడా రావడంతో నవవంబరులో ఎనిమిదిరోజులు పనిచేయవు.
ఖాతాదారులు సెలవురోజుల్లో ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/