ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 13.54 పాయింట్లు లాభపడి 59,846.51 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24.90 పాయింట్లు లాభపడి 17,624.05 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.97గా నిలిచింది.