నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః నేడు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సూచీలు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 71,645కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 21,697 వద్ద స్థిరపడింది.