నేడు సీబీఐ కోర్టుకు మనీశ్‌ సిసోడియా

manish-sisodia-request-for-bail-to-be-heard-by-cbi-court-at-2-pm-today

న్యూఢిల్లీః ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో అరెస్టైన ఆయన తనకు బెయిల్‌ మంజూరు చేయాలని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మనీశ్‌ సిసోడియా ప్రస్తుతం ఐదు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ శనివారంతో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ సమయంలోనే బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనున్నట్లు సమాచారం.

కాగా, గత ఆదివారం మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సిసోడియాకు సూచించింది. దీంతో ఆయన బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఢిల్లీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌కు దాఖలు చేశారు.