నన్ను అరెస్టు చేసేందుకు కుట్ర: మనీశ్ సిసోడియా

సీబీఐ సమన్లపై స్పందించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

Manish Sisodia-No IPL, Other Sports Event In Delhi
manish-sisodia-could-be-arrested-in-a-fake-case-as-a-part-of-the-bjps-plan

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన సమన్లపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడం కోసం తనను అరెస్టు చేసే పన్నాగం పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరఫున తాను అక్కడ ప్రచారం చేయబోతున్నానని చెప్పారు. తాను అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడానికే ‘నకిలీ కేసు’లో విచారణ పేరుతో సీబీఐతో నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు అధికారుల ముందుకు వెళ్లనున్నారు.

గుజరాత్ లో ఓటమి ఖాయమని బిజెపి నేతలకు అర్థమైందని సిసోడియా పేర్కొన్నారు. ఓటమి భయంతోనే ఆప్ ప్రచారానికి ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. అయితే, తనను అరెస్టు చేస్తే గుజరాత్ లో ఆప్ ఎన్నికల ప్రచారం ఆగదని సిసోడియా ట్వీట్ చేశారు. గతంలో సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. దాదాపు 14 గంటల పాటు సోదాలు జరిపినా అధికారులకు ఏమీ దొరకలేదని చెప్పారు. తన నివాసంతో పాటు బ్యాంకు లాకర్లు కూడా తనిఖీ చేశారని, అందులోనూ ఏమీ దొరకలేదని వివరించారు. ఈ నేపథ్యంలోనే తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సిసోడియా ఆరోపించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/