ఈరోజు హైదరాబాద్ కు రానున్న మాణిక్ రావు ఠాక్రే

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు మాణిక్ రావు ఠాక్రే నగరంలో ఉండనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే రీసెంట్ గా చనిపోయిన పీసీసీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సింధూ శంకర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రాత్రి 8 గంటలకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు కూతురు, మహారాష్ట్ర ఎమ్మెల్యే కైలాశ్ గోరంట్యాల్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.

ఇక రేపు (ఈనెల 15న) పార్టీ ఎస్టీ విభాగం చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్లు, ఆఫీస్ బేరర్లతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం పార్టీ వైస్ ప్రెసిడెంట్లతో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రపై రివ్యూ చేస్తారని వెల్లడించింది. సాయంత్రం కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో భేటీ అయ్యి.. ఎల్లుండి నాగ్ పూర్ కు వెళ్లనున్నారు.