మొక్కులు తీర్చే పనిలో సమంత

నటి సమంత మొక్కులు తీర్చే పనిలో పడ్డారు. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సామ్..ఫస్ట్ మూవీ తోనే అందర్నీ మాయ చేసింది. ఆ తర్వాత వరుస ఛాన్సులతో అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగ చైతన్య ను పెళ్లి చేసుకోవడం, కొంతకాలానికే విడాకులు ఇవ్వడం జరిగింది. విడాకుల అనంతరం ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధిని పడింది. ఈ విషయాన్నీ స్వయంగా సమంతానే తెలుపడం తో అంత ఖంగారుపడ్డారు. ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకున్నారు.

కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంది సమంత. ప్రస్తుతం వ్యాధి నుండి బయటపడడంతో దేవుళ్లకు మొక్కులు తీర్చుకునే పనిలో పడింది. తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించారు సమంత. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పళని సుబ్రమణ్య స్వామికి సామ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.