చంద్రబాబు రోడ్ షోలో విషాదకర ఘటన..

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రోడ్ షో లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్ షో లో ప్రమాదానికి గురైన అడుసుమిల్లి వెంకటేశ్వర్లు అనే కార్యకర్త మృతి చెందాడు. చంద్రబాబు అమరావతి రోడ్డు షోలో ఉన్న సమయంలో రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొని అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఈ మంటల్లో అడుసుమిల్లి వెంకటేశ్వర్లు చిక్కుకున్నాడు. మంటల్లో శరీరం చాలా వరకూ కాలిపోవడంతో అతడిని హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున వెంకటేశ్వర్లు మృతి చెందారు. వెంకటేశ్వర్లు స్వస్థలం అచ్చంపేట మండలం గ్రంధశిరి. వెంకటేశ్వర్లు కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు.