నేడు మంత్రిగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ

పట్నం మహేందర్‌రెడ్డి నేడు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న మంత్రిగా పట్నం ప్రమాణ స్వీకరించిన సంగతి తెలిసిందే. సచివాలయం మొదటి అంతస్థులోని కార్యాలయంలో మధ్యాహ్నం 2 గం టలకు పట్నం బాధ్యతలను స్వీకరించనున్నారు.

సుమారు ఐదేళ్ల అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి మంత్రి మహేందర్‌రెడ్డి వర్గం మంగళవారం వెళ్లింది. మంత్రి ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లిన నాయకులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తండ్రి విట్టల్‌రెడ్డి స్వీటు తినిపించారు. అనంతరం చర్చలు, ఉపన్యాసాలు చేశారు. మహేందర్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన తర్వాత వారు తాండూరుకు రాలేదు. ఈ వారంలో వారిద్దరినీ ఒకేసారి పిలిపించి ర్యాలీ నిర్వహించి స్వాగతం చెప్పాలని నిర్ణయించారు.