రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపిదే విజయం – నడ్డా
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి విజయం సాధించడం ఖాయం అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దేశం వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రజలు బిజెపి కే పట్టం కడుతున్నారని , తెలంగాణ లో కూడా అలాగే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధముగా ఉన్నారని ఆయన అన్నారు.
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి డీకే అరుణ, ఎంపీ క్ష్మణ్, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. సోమవారం ప్రారంభమైన సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. రానున్న ఎన్నికల్లో అనుసంరించాల్సిన వ్యూహాలు, బూత్ స్థాయిలో పటిష్ఠం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై మొదటి రోజు చర్చించారు.