వివాదంలో లవ్ స్టోరీ..

A Still From Love Story movie
A Still From Love Story movie

ఇండస్ట్రీ లో కూల్ డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల పేరే చెపుతారు. చాల గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ కొడుతుంటారు. తాజాగా నాగ చైతన్య – సాయి పల్లవి లతో లవ్ స్టోరీ అనే మూవీ తెరకెక్కించారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ నెల 24 న థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్‌లోని ఓ డైలాగ్ పై ఇప్పుడు వివాదం చోటుచేసుకుంది.

చిత్రంలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. హీరో లోన్ కోసం ఒక బ్యాంక్‌కు వెళ్లిన సమయంలో గొర్రెలోడికి గొర్రెలిస్తే వాడు గొర్రెలనే మేపుతాడు.. రిక్షావాడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షానే తొక్కుతాడు అంటూ చైతన్య ఓ డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు ఈ డైలాగ్ పై కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలోడికి గొర్రెలిస్తే తప్పు అయితే సినిమాలు తీసేవాళ్ళు సినిమాలే తీస్తారా వేరే వ్యాపారాలు చేయరా.. ప్రతి ఒక్కళ్ళూ సర్కార్ పథకాల పై సెటర్స్ వేసేవాళ్ళే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మరి ఈ వివాదం ఫై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.

YouTube video