లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడం ఫై చంద్రబాబు ఆగ్రహం

యువగళం పేరుతో నారా లోకేష్ గత 13 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలుపలుకుతున్నారు. లోకేష్ సైతం ఎంతో ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూ, ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం లోకేష్ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవడం ఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా చంద్రబాబు సైతం లోకేష్ యాత్రనుఅడ్డుకోవడం ఫై ఫైర్ అయ్యారు. ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని నిలదీశారు. బయటికి రాకుండా అందరినీ బెదిరించి చంపేస్తారా? అంటూ మండిపడ్డారు. జగన్ ఓడిపోతారని అన్ని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవడం ఖాయమని వ్యాఖ్యానించారు.