నైజాం లో కుమ్మేస్తున్న లవ్ స్టోరీ

ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా,,,హిట్ కొట్టామా లేదా..అన్నట్లు లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్ల తో మళ్లీ థియేటర్స్ వద్ద సందడి తీసుకొచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అన్ని థియేటర్స్ వద్ద ప్రేక్షకుల కోలాహలం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డ్స్ తిరగరాస్తుంది.

ఇక నైజాం లో ఈ మూవీ మొదటి ఐదు రోజుల్లోనే రూ. 10.08 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలిపి 21.18 కోట్ల రూపాయల షేర్ ను సాధించినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26.66 కోట్ల షేర్ ను .. 46.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ తరువాత చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ. ప్రేక్షకులను మాత్రం అలరించలేక పోయాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సినిమాలు కొన్నయితే, అసలు వచ్చాయో లేదో తెలియని సినిమాలు మరి కొన్ని. అలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు వచ్చిన ‘లవ్ స్టోరీ’ వసూళ్ల ప్రభంజనం కనపరుస్తుండడం తో చిత్ర యూనిట్ తో పాటు థియేటర్స్ యాజమాన్యం , డిస్ట్రబ్యూటర్లు సంబరాలు చేసుకుంటున్నారు.