గ్యాస్ లీక్‌ ఘటనపై లోకేశ్ ట్విట్‌

ఎలాంటి మెడికల్‌ క్యాంపులు లేవు, షెల్టర్లు లేవు

Nara lokesh
Nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ట్విటర్‌ ద్వారా స్పందించారు. గ్యాస్ లీక్‌ ఘటనపై ఆందోళనకు దిగిన వారిపట్ల ఏపి ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని ఆయన అన్నారు. ‘ఎలాంటి మెడికల్‌ క్యాంపులు లేవు, షెల్టర్లు లేవు, అంతా కలుషితం అయిపోయింది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మా సమస్యలు పరిష్కరించండి అని స్థానిక యువత ఆందోళన తెలుపుతుంటే వారిని అడ్డుకొని కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మంచిది కాదు’ అని లోకేశ్ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/