జూ. ఎన్టీఆర్ వచ్చిన టీడీపీ కి ఉపయోగం లేదు – లక్ష్మి పార్వతి

వైస్సార్సీపీ నేత లక్ష్మి పార్వతి టీడీపీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ని జూ. ఎన్టీఆర్ కూడా కాపాడలేరని అన్నారు. పూర్తిగా పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ తీసుకొని ఐదేళ్ళ పాటు జగన్ లాగా ప్రజలతో మమేకం అవ్వాలన్నారు. అంతే కాదు బీఆర్ఎస్ వచ్చినా వీఆర్ఎస్ కావడమేనని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే వివేకా హత్య జరిగిందన్నారు లక్ష్మీపార్వతి.

అప్పుడు పోలీసంతా చంద్రబాబు చేతిలోనే ఉన్నారని.. ఈ కేసును అప్పుడు సీబీఐకి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివేకా హత్య కేసులు సీబీఐకి ఇచ్చారని.. దీన్ని బట్టి ఈ కేసులో వ్యవహారంలో ఎవరు సిన్సియర్‌గా ఉన్నారో అర్థం అయిపోతుందన్నారు. శనివారం ఒమేగా హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మి పార్వతి పాల్గొన్నాారు. జనరల్ చెకప్ కోసం వచ్చానని.. క్యాన్సర్ కి ఎవరూ భయపడవద్దన్నారు.