కరోనా కాటుకు యూపీ మంత్రి కమలారాణి మృతి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి

UP Minister Kamalarani died due to corona
UP Minister Kamalarani died due to corona

Lucknow: కరోనా కాటుకు ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమలారాణి మరణించారు. కొద్ది రోజుల కిందట ఆమె కరోనా బారిన పడ్డారు.

చికిత్సనిమిత్తం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారు.

అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. కమలారాణి  మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/