పశ్చిమ బెంగాల్లోనే కరోనా మరణాలు అధికం
సీఎస్కు రాసిన లేఖలో పేర్కొన్న కేంద్ర బృందం
కోల్కతా: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల రేటు పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువగా ఉందని కేంద్ర బృందం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో అంతర మంత్రిత్వశాఖల కేంద్రం బృందం తెలిపింది. అంతేకాక భారత్లోఅత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 12.8 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ఆ లేఖలో కేంద్ర బృందం నేత అపూర్వ చంద్ర పేర్కొన్నారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ దన్ఖర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/