లలిత జ్యూయలర్స్‌ రూ.కోటి విరాళం

సిఎంకు చెక్కు అందజేసిన సిఎండి

Lalitha Jewelers donates Rs 1 Crore
Lalitha Jewellery Mart donates Rs 1 Crore

ముఖ్యాంశాలు

  • కోవిడ్‌-19 నివారణ సహాయక చర్యలకు చేయూత
  • లలిత జ్యూయలరీ మార్ట్‌ ప్రై.లి. రూ.కోటి విరాళం
  • సంస్థ సిఎండి డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి అభినందన

Amaravati: రాష్ట్రంలో కోవిడ్‌-19 నివారణ సహాయక చర్యలకు చేయూతగా లలిత జ్యూయలరీ మార్ట్‌ ప్రై.లి. రూ.కోటి విరాళం అందజేసింది.

బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎం సహాయనిధికి గానూరూ.కోటి చెక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ఆ సంస్థ సిఎండి డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌ అందజేశారు.

ఈసందర్భంగా కిరణ్‌కుమార్‌ను సిఎం అభినందించారు.