ఫార్ములా-ఈ రేసు రద్దు..కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం: కెటిఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్న నిర్వాహకులు

KTR

హైదరాబాద్‌ః హైదరాబాద్ లో వచ్చే నెల జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రేసును రద్దు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రేసు రద్దుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందిస్తూ… రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమని ఆయన మండారు.

హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్ లు హైదరాబాద్ తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయని చెప్పారు. ఇండియాకు ఈ-ప్రిక్స్ ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఎలెక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిదారులు, స్టార్టప్ లు హైదరాబాద్ ను పెట్టుబడులకు అనుమైన ప్రదేశంగా గుర్తించాయని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు.