రామ్ ఆయేంగే..సాంగ్‌ను షేర్ చేసిన ప్ర‌ధాని మోడీ

Ahead Of Ayodhya Event, PM Modi Shares Swasti Mehul “Ram Aayenge” Song

న్యూఢిల్లీ: ఈ నెల 22వ తేదీన అయోధ్య‌లో రామాల‌యాన్ని ఓపెన్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఈరోజు త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ సాంగ్‌ను షేర్ చేశారు. రాముడిపై యువ సింగ‌ర్ స్వస్తి మెహుల్ పాడిన రామ్ ఆయేంగే .. ఆయేంగే.. రామ్ ఆయేంగే భ‌జ‌న‌ ఫుల్ పాపుల‌ర్ అయ్యింది. రాముడికి అంకితం చేస్తూ ఆమె పాట పాడిన తీరు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఆమె స్వ‌రం రామ భ‌కుల్ని గెలుచుకున్న‌ది.

కాగా, ఆ సాంగ్‌పై మోడీ త‌న ట్వీట్‌లో ప్ర‌శంస‌లు కురిపించారు. స్వ‌స్తిజీ స్వ‌ర‌లో ఈ రామ కీర్తన వింటే , అది మ‌న చెవుల్లో చాలా కాలం మారుమోగుతుంద‌ని, కండ్ల‌ల్లో నీళ్లు తిరుగుతాయ‌ని, భావోద్వేగాల‌తో మ‌ది నిండిపోతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఆ సాంగ్‌ను ప్రధాని ట్వీట్ చేసిన గంట‌లోనే మూడు ల‌క్ష‌ల వ్యూవ్స్ వ‌చ్చాయి.