జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురికి గాయాలు

జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విరని దగ్గరలోని హాస్పటల్ లో చేర్పించారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో తరుచు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే ఉంటాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణముగా తరచూ ప్రమాదాలు జరగడం..కోట్లలో నష్టం వాటిల్లడం తో పాటు మనుషుల ప్రాణాలు సైతం అగ్నికి ఆహుతి అవుతున్నాయి.

తాజాగా సోమవారం ఓ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా పొగ అలుముకుంది. ఈప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పొగ చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.