చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఫై కేటీఆర్ కామెంట్స్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ గత 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ఫై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అలర్జీ, బరువు తగ్గడం, దోమలు, కలుషితమైన నీరు వంటి కారణాలు చూపి ప్రాణభయం ఉందని లోకేష్ ట్వీట్ చేశాడు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఇందుకు పూర్తి బాధ్యత సీఎం జగన్ దే అంటూ పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ ఫై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. నారా లోకేష్ ట్వీట్ చూసి బాధనిపించిందన్నారు. చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు కేటీఆర్.

‘కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నాం’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.