కృష్ణంరాజుకు తలకొరివి పెట్టేది ప్రభాస్ కాదట..

రెబెల్ స్టార్ కృష్ణంరాజు నిన్న ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వస విడిచారు. ఈయన మరణం చిత్రసీమకు తీరని లోటుగా చెప్పాలి. ఈయన మరణ వార్త తెలిసి..కడసారి ఆయన్ను చూసేందుకు చిత్రసీమతో పాటు రాకియ ప్రముఖులు కదిలివచ్చారు.

ఈరోజు మధ్యాహ్నం మొయినాబాద్ లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద నుండి ఉదయం 11:30 గంటలకు పార్థివదేహం బయలుదేరుతుంది. నిన్నటి వరకు అందరూ కృష్ణం రాజుకు తలకొరివి పెట్టేది ప్రభాసే అనుకున్నారు. కానీ చివరి క్షణంలో.. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణం రాజు అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. అలాగే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబదించిన ఏర్పాట్లు చేస్తున్నారు.