మోడీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు..

Konda Vishweshwar reddy couple meets PM Modi

ప్రధాని మోడీని కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు కలిశారు. శుక్రవారం ఢిల్లీలో మోడీని కలిసిన సందర్భంగా తమ రెండో కుమారుడు విశ్వజిత్‌‌‌‌ పెండ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. తర్వాత రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు. ప్రధానితో భేటీలో తెలంగాణలో వైద్యం, విద్య అంశాలపై చర్చించామని విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్‌‌‌‌ చేశారు.

తెలంగాణలో వైద్యం, విద్య, తదితర అంశాల మీద వారితో చర్చించడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది. స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేసే మా స్వచ్ఛ్ ట్రక్ ప్రాజెక్టు, ఇంకా పెద్దమంగళారంలో ఉన్న మా బయో గ్యాస్ ప్రాజెక్టుల గురించి ప్రధాని మోడీకి వివరించాం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఎంతో ఓపికతో ప్రధాని విన్నారని తెలిపారు. ఇంత సమయం ఇచ్చినందుకు తాము చాలా సంతోషిస్తున్నాము. ప్రధాని మోడీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే అయన భార్య సంగీతా రెడ్డి కూడా ప్రధాని మోడీతో భేటీపై స్పందించారు. ఎంతో అప్యాయంగా పలకరించారన్నారు. ఈ సందర్బంగా పలు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడామని చెప్పారు.