నేడు ఆస్ట్రేలియాకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేడు ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… మళ్లీ నవంబర్‌ 7న తిరిగి హైదరాబాద్‌ రానున్నాడు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా కొనసాగుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నేతలు మునుగోడు ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో మునుగోడు లో ప్రచారం చేయాల్సిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి హాజరుకాకుండా విదేశాలకు వెళ్తుండడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది.

ఇప్పటికే బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తుండగా..కీలక నేత , రాజగోపాల్ బ్రదర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విదేశాలకు వెళ్లడం కార్య కర్తల్లోనూ ఆగ్రహం తెప్పిస్తుంది. ముందు నుండి కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి రాను అనే సమాధానం చెపుతూ వచ్చారు. రీసెంట్ గా కూడా ప్రచారంలో పాల్గొనడం ఫై క్లారిటీ ఇచ్చారు.

మునుగోడులో తన లాంటి హోమ్ గార్డ్స్‌ ప్రచారం అవసరం లేదని అన్నారు. ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని యెద్దేవా చేశారు. ‘‘వంద కేసులు పెట్టినా సరే సర్కార్‌ను తీసుకొస్తానని ఓ నేత చెప్పాడు. ఆయనే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తాడు.. నాతో ఏం పని?. నేనెప్పుడు విదేశాలకు వెళ్లేది.. కేటీఆర్‌ను అడగండి’’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.