ఢిల్లీ ఓటర్లకు సీఎం కేజ్రీవాల్ 10 హామీలు

డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు

arvind-kejriwals-10-promices-for-mcd-elections

న్యూఢిల్లీః డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ 10 హామీలను ఇచ్చారు. డిసెంబర్ 7న ఓట్ల లెక్కంపు జరగనుంది.

కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు:


.చెత్తకుప్పలను తొలగించడం ద్వారా ఢిల్లీ వీధులను పరిశుభ్రంగా ఉంచడం
.అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా అవినీతి రహితంగా మార్చడం
.దేశ రాజధానిలో పార్కింగ్ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వడం
.రోడ్లపై సంచరించే జంతువుల సమస్యను పరిష్కరించడం
.రోడ్ల మరమ్మతులతో పాటు నగర సుందరీకరణ
.ప్రపంచ స్థాయి విద్య, వైద్య మౌలిక సదుపాయాలను కల్పించడం
.పార్కుల సుందరీకరణ
.మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్లకు సకాలంలో వేతనాలను ఇవ్వడం
.ఢిల్లీలోని వ్యాపారవేత్తలు, వ్యాపారుల సమస్యలను పరిష్కరించడం
.అవినీతిని అరికట్టేందుకు విక్రేతలకు వెండింగ్ జోన్ ఏర్పాటు చేయడం

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/