తెలంగాణ ఎన్నికలు..పవన్‌ మద్దతు కోరిన కిషన్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో మద్దతివ్వాలని అడిగిన బిజెపి నేతలు

kishan-reddy-meets-pawan-kalyan

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం జనసేనానితో కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బిజెపికి మద్దతు విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వారుకు స్పష్టం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను బిజెపి నేతలు పవన్ మద్దతును కోరారు.

జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపికి దగ్గరైంది. బిజెపి, జనసేన, టిడిపి కలిసి వెళ్లాలని పవన్ భావిస్తుండగా, బిజెపి మాత్రం టిడిపితో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేదు. దీంతో ఏపీలో టిడిపి, జనసేన కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి దూరంగా ఉంటోన్న నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తానని చెప్పడం గమనార్హం.