సెల్టోస్ ఎస్యూవీ కారు ధర పెరిగింది
న్యూఢిలీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సెల్టోస్ ఎస్యూవీ కారు ధరలను పెంచింది. మోడల్ ఆధారంగా రూ. 25,000 నుంచి రూ.35,000 వరకు పెంపుదల ఉంటుందని ప్రకటించింది. గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర అంతక్రితం రూ.9.69 లక్షలు ఉండగా..పెంపుదల తర్వాత రూ.9.89లక్షలు – 16.29 లక్షల దాకా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇక మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, రెనో సంస్థలు గతనెలలోనే కార్ల ధరలను పెంచాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చయండి:https://www.vaartha.com/news/sports/