భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 843 పాయింట్లు నష్టపోయి 57,147కి పడిపోయింది. నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 16,983కి దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.37 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/