కరోనా అనుమానంతో యువకులు దాడి వ్యక్తి మృతి

కరోనా అందరికీ అంటిస్తాడేమోనని రాళ్లతో కొట్టిన యువకులు

coronavirus
coronavirus

కెన్యా: కరనా వైరస్‌ ప్రపంచదేశాల్లో మృత్యుఘంటీకలు మోగిస్తుంది. తాజాగా కెన్యాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా ఉందన్న అనుమానంతో కొందరు యువకులు కొట్టిచంపారు. క్యాలే ప్రాంతంలోని ఎంసాబ్వెని గ్రామంలో ఈ ఘటన జరిగింది. జార్జ్ కొటిని హెజ్రోన్ అనే వ్యక్తి బార్ కు వెళ్లి వస్తుండగా ఓ జన సమూహం అతడిని అడ్డగించింది. ఆ సమూహంలోని యువకులు అతడికి కరోనా వైరస్ సోకిందని అనుమానం వ్యక్తం చేశారు. తమకు కూడా వైరస్ అంటిస్తాడన్న భయంతో రాళ్లతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన హెజ్రోన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. దీనిపై స్థానిక పోలీస్ అధికారి జోసెఫ్ ఎన్ తెంగే మాట్లాడుతూ, మృతుడికి కరోనా వైరస్ ఉందో, లేదో స్పష్టంగా తెలియదన్నారు. ఆ వ్యక్తి అస్వస్థతతో బాధపడుతున్నవాడిలా ఊగుతూ నడుస్తుండడంతో కరోనా సోకిందేమోనని స్థానికులు భయపడ్డారని, అందుకే కొట్టి చంపి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/