రేపు కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం..ప్రధానోపాధ్యాయులకు ఆహ్వనం

Kejriwal
Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ రేపు సిఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రజలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్‌ ఆహ్వానించింది. తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైస్‌ ప్రిన్సిపల్స్‌, కరిక్యూలమ్‌ కో ఆర్డినేటర్స్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఆప్‌ ప్రభుత్వంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు.విద్యా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు కేజ్రీవాల్‌. నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. కాగా ఇక కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడి ని కూడా ఆహ్వానించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/