MS సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్..?

సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మెప్పించిన కీర్తి సురేశ్.. ఇప్పుడు లెజెండరీ సింగర్ దివంగత MS సుబ్బలక్ష్మి జీవిత కథలో నటించనున్నారని తెలుస్తోంది. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమాను నాగ్ అశ్విన్ ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. అందులో కీర్తి సురేష్ ప్రాణం పెట్టి నటించింది. అందుకే ఇప్పుడు ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కూడా కీర్తి సురేష్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనేస్తున్నారు. చిన్ననాటి నుంచే సంగీతం మీద ఆసక్తితో ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ఆ సంగీతమే తన ఊపిరిగా మార్చుకున్నారు. అలాంటి ఎం.ఎస్ గారి జీవిత కథ సినిమాగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఆ సినిమా కీర్తి సురేష్ కాదంటే మాత్రం ఆ ఛాన్స్ నయనతార లేదా త్రిషకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రభాస్ కల్కి లో బుజ్జి పాత్రకు తన వాయిస్ అందిస్తుంది. మరోపక్క బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. తమిళనాడులో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సుబ్బలక్ష్మి గొప్ప గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, జీవితంలో విషాద ఘటనలన్నీ ఇందులో ఉంటాయని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని టాక్.