పవన్ కళ్యాణ్ నుండి మరో రెండు అప్డేట్స్ వచ్చాయి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భాంగా ఉదయం నుండి పవన్ కళ్యాణ్ అప్డేట్స్ తో సోషల్ మీడియా మారుమోగిపోతుంది. ఓ పక్క ఆయన కు బెస్ట్ విషెష్ అందిస్తూ సినీ ప్రముఖులు వరుస ట్వీట్స్ పెడుతుంటే..మరోపక్క ఆయన తాజా చిత్రాల తాలూకా అప్డేట్స్ అభిమానులను సంబరాలకు గురి చేస్తున్నాయి. ఉదయం భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ విడుదల కాగా..ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ రెండే కాక మరో రెండు అప్డేట్స్ వచ్చాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో చెయ్యబోయే సినిమా అప్‌డేట్ కూడా వచ్చేసింది

పవన్ – హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. సక్సెస్ ఫుల్ చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో ఈరోజు పవన్ బర్త్ డే సందర్భాంగా విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.. ‘జాతర షురూ.. మళ్లీ (Fully)లోడింగ్’.. అంటూ హార్లీ డేవిడ్‌సన్ డీలక్స్ బైక్‌పై స్టైలిష్‌గా కూర్చుని ఉన్న పవన్‌ని సగం చూపిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘This Time, it’s not just Entertainment’ అనే క్యాప్షన్‌తో ఈసారి ‘గబ్బర్ సింగ్’ ని మించిన సక్సెస్ కొడతామని హింట్ ఇచ్చారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అలాగే పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 29న చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న నూతన చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘యథా కాలమ్‌.. తథా వ్యవహారమ్‌’ అని పోస్టర్‌పై ఉన్న స్లోగన్‌ ఆకట్టుకుంటుంది.