కెసిఆర్ కనిపించకపోవడం బాధను కలిగిస్తోందిః బండి సంజయ్

కెసిఆర్ కనిపించడం లేదు.. కెటిఆర్ పై అనుమానం కలుగుతోంది.. బండి సంచలన వ్యాఖ్యలు

bandi-sanjay

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ తనకు గురువు అని… కెసిఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని బిజెపి నేత బండి సంజయ్ అన్నారు. కెసిఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వివరాలను వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ కనిపించకపోవడం తనకు చాలా బాధను కలిగిస్తోందని.. ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు. కెసిఆర్ కనిపించకపోవడంపై… తనకు కెటిఆర్ పై అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. బిజెపి అధికారంలోకి వస్తే ఈ అప్పుల బాధ పోతుందని అన్నారు. బిజెపి పాలనలో బీసీలకు మంచి జరుగుతుందని చెప్పారు.