మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలన యోచనలో కెసిఆర్ ?

నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి కెసిఆర్ పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం

kcr-thinking-of-contesting-from-maharashtra

ముంబయిః వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలంగాణను దాటి మహారాష్ట్రలో కెసిఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్రలో ఇప్పటికే పలు భారీ బహిరంగసభలను నిర్వహించారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరారు. ఇంకోవైపు పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలని కెసిఆర్ భావిస్తున్నారని చెపుతున్నారు. నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం. మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.